ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకు భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు అధికారులు సైతం మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. 

 

 ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ తీవ్రతను బట్టి పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు పరుస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇక ప్రజా ప్రతినిధులు పోలీసులపై కూడా ఈ మహమ్మారి వైరస్ పంజా విసురుతున్న విషయం తెలిసిందే. తాజాగా నెల్లూరులోని వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం సృష్టించింది.  దాదాపు 11 మంది పోలీసు సిబ్బందికి కరోనా  పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బతో పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా మూతపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: