ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 998 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఏపీలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ కేసులలో రాష్ట్రానికి చెందిన కేసులు 961 కాగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు చెందిన కేసులు 37 ఉన్నాయని సమాచారం. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం 10,043 యాక్టివ్ కేసులు ఉండగా 8,422 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 14 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 232కు చేరింది. ఒక్కరోజే దాదాపు వెయ్యి కేసులు నమోదు కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల వల్లే భారీగా కేసులు నమోదవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: