హైదరాబాద్‌ మహానగరంలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్యాక్రాంతమవుతున్న అస్తుల పరిరక్షణ కోసం గ్రేటర్ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ‘అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌’ ను ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ అస్సెట్‌ ప్రొటెక్షన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 0099 ను ప్రారంభించారు. 
 
నగరంలోని ప్రభుత్వ ఆస్తుల రక్షణకు ప్రజల సహకారం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. చెరువులు, పార్కులు, బహిరంగస్థలాల్లో కబ్జాకు పాల్పడినా, ప్రైవేట్ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రైవేట్ భూములు కబ్జాకు పాల్పడినా టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అస్సెట్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ పనిచేయనుందని... వారంలో అన్ని పనిదినాల్లో అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ సేవలు అందుతాయని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: