దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్  దవాఖానాలో  కరోనా  రోగులు  అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించనున్నట్లు తాజాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చైర్మన్ జి సతీష్ రెడ్డి వెల్లడించారు. 

 

 కరోనా వైరస్ రోగులకు 24 గంటలపాటు సేవలందించేందుకు ఆర్మీకి చెందిన వైద్యులు నర్సులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని ఆయన వెల్లడించారు. కేవలం పన్నెండు రోజుల వ్యవధిలోనే వెయ్యి పడకల తాత్కాలిక ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీనికి కేంద్ర హోంశాఖ టాటా సన్స్ ఇతర సంస్థలు కూడా సహకారం అందించినట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: