ఈ మధ్య కాలంలో రాజకీయ, సినీ ప్రముఖులు, సామాన్యులు అనే తేడాలు లేకుండా అందరూ కరోనా భారీన పడుతున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని పలువురు ఎమ్మెల్యేలు వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుల్లితెర నటులు నవ్య స్వామి, రవికృష్ణ, ఇతరులకు కరోనా సోకింది. తాజాగా పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు కరోనా నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధ పడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. 
 
హోమ్ ఐసోలేషన్ లో ఉండి ఆయన చికిత్స చేయించుకుంటున్నారు. దాపు 15 రోజుల నుంచి గ్రామాల్లో పర్యటిస్తుండడం, అలాగే కార్యాలయానికి కూడా ఎక్కువమంది ప్రజలు రావడం వల్ల వారి నుంచి కరోనా సోకి ఉండవచ్చని తెలుస్తోంది. ఆయన కుటుంబసభ్యుల్లో కూడా ఒకరికి కరోనా నిర్ధారణ అయినట్లు సమాచారం అందుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: