కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ కి చెందిన ఒక ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆమెను విష నాగు తో పోల్చారు. బంకురా జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ... తృణమూల్ పార్టీకి చెందిన సెరాంపూర్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, దేశ ఆర్ధిక వ్యవస్థను నిర్మల నాశనం చేశారని విమర్శలు చేసారు. 

 

దేశం నిర్మలా సీతారామన్ లాంటి ఆర్ధిక మంత్రిని గతంలో ఎప్పుడూ చూడలేదని అంటూ పాము కాటుకు మనుషులు చనిపోయినట్లు గానే నిర్మల ఆర్ధిక వ్యవహారాలతో జనం చనిపోతున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: