గత కొన్ని రోజులుగా బోర్డర్ సెక్యురిటి ఫోర్స్ లో  కరోనా కేసులు కాస్త తగ్గాయి అని భావించినా సరే మరోసారి కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు అనూహ్యంగా పెరగడం చూసి షాక్  అయ్యారు. గత 24 గంటల్లో, 36 మంది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది పాజిటివ్ గా తేలినట్లు అధికారులు వెల్లడించారు. 

 

33 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 526 క్రియాశీల కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. కరోనా బారి నుంచి ఇప్పటి వరకు 817 మంది సిబ్బంది కోలుకుని బయటపడ్డారు అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆరుగురు సైనికుల పరిస్థితి కాస్త విషమంగా ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: