జమ్మూ కాశ్మీర్ లో దాదాపు నెల రోజుల నుంచి ఎక్కడో ఒక చోట ఆపరేషన్ నిర్వహిస్తూనే ఉన్నాయి భద్రతా బలగాలు. ఆపరేషన్ ఆల్ అవుట్ పేరుతో భద్రతా బలగాలు ఉగ్రవాదులను కాల్చి చంపుతున్నాయి. ఇక నిన్న కూడా జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్కౌంటర్ జరగగా అందులో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి మన బలగాలు. 

 

అయితే ఇప్పుడు వారికి సంబంధించి ఇక కీలక విషయం బయటకు వచ్చింది. నిన్న కుల్గాంలోని అర్రే గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులకు కరోనా పాజిటివ్ అని తెలిసింది. వారికి మెడికల్ పరంగా చట్టపరంగా ఫార్మాలిటీలను నిర్వహిస్తున్నప్పుడు వారి నమూనాలను సేకరించామని జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. పరిక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తెలిసినట్లు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: