భారత్ పై మిడతల ప్రభావం కొనసాగుతూనే ఉంది. భారత్ లో ఎక్కడో ఒక చోట మిడతలు దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా మిడతలు రాజస్థాన్ లోని నాలుగు మూడు ప్రాంతాల్లో తమ ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ లో మిడతల పై యుద్దానికి గానూ హెలికాప్టర్లను వాడుతున్నారు. 

 

రాజస్థాన్ లో మిడుత నియంత్రణ ఆపరేషన్‌లో భాగంగా జోధ్‌పూర్‌కు సమీపంలోని కెర్లానాడాలో హెలికాప్టర్ ద్వారా పురుగుమందులను వైమానిక దళం స్ప్రే చేయడం జరుగుతుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. మిడతల పై  ఇలా యుద్ధం చేయడం ఇదే తొలిసారి. ఇక ఆరు రాష్ట్రాలకు మిడతల ప్రభావం ఉండే అవకాశం ఉంది అని అధికారులు వెల్లడించారు. అందులో మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: