భారత్ నుంచి వెళ్లి విదేశాల్లో లాక్ డౌన్ కారణంగా అంతర్జాతీయ విమానాలు నడవని కారణంగా  ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం కేంద్రం వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక విమానాలను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే మరోసారి అమెరికా నుంచి భారత్ ప్రత్యేక విమానాలను నడుపుతుంది. 

 

ఎయిర్ ఇండియా 2020 జూలై 11 నుండి జూలై 19 వరకు వందే భారత్ మిషన్ లో భాగంగా 36 విమానాలను నడుపుతామని ఎయిర్ ఇండియా పేర్కొంది. అయితే ఏయే రాష్ట్రాల నుంచి నడుపుతారు అనే విషయాన్ని ఇంకా ఎయిర్ ఇండియా వెల్లడించలేదు. దీనిపై త్వరలోనే ప్రకటన చేయనుంది. పలు దశల్లో విదేశాల నుంచి ఎయిర్ ఇండియా విమానాలను నడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: