ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ జిల్లా మోదీ నగర్‌లో కొవ్వొత్తులు తయారు చేసే కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. కర్మాగారంలో మండే స్వభావం గల రసాయనాలను ఉంచగా వాటికి మంటలు అంటుకుని పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. 

 

ఆ తర్వాత కర్మాగారం మొత్తం అగ్ని కీలలు వ్యాపించాయి. 12కు పైగా అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: