బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీకి మరో కీలక పదవికి ఎంపికయ్యాడు. రాబోయే సీజన్​ ఇండియన్​ సూపర్​ లీగ్​లో ప్రముఖ ద్వయం​ ఏటీకే-మోహన్​ బగన్​ ​ఫుట్​బాల్ ​ఫ్రాంచైజీ బోర్డు ఆఫ్​ డైరెక్ట్​ర్స్​లో సభ్యుడుగా చోటు లభించింది. జులై 10న భేటీ కానున్న సభ్యులు.. క్లబ్​కు కొత్త పేరు, జెర్సీ, లోగో అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుత బోర్డు డైరెక్టర్లలో ఒకరైన ఉత్సవ్​ పరేఖ్ దీనిని​ స్పష్టం చేశారు. గంగూలీ ఈ ఫ్రాంచైజీ డైరెక్టర్​గా బాధ్యతలు చేపట్టేందుకు 100 శాతం అర్హుడని అన్నారు.

 

 


ప్రస్తుతం ఉత్సవ్​ పరేఖ్​, శ్రిన్​జోయ్​ బోస్​, దెబాశిష్​ దత్తా​, గౌతమ్​ రేయ్​, సంజీవ్​ మెహ్రా సభ్యులుగా ఉన్నారు. ఇప్పటికే ఐఎస్​ఎల్​ టైటిల్​ను మూడు సార్లు, ఐ-లీగ్​ ట్రోఫీని రెండుసార్లు  ఏటీకే క్లబ్​ గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: