పరస్పర ప్రయోజనాల అంశంలో కెప్టెన్ కోహ్లీపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా.. బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ డీకే జైన్కు మెయిల్ పంపారు. ఇందులో విరాట్ వ్యాపార సంస్థల గురించి ప్రస్తావించారు. లోధా ప్యానెల్ సిఫారసులను అతడు ఉల్లంఘిస్తున్నాడని గుప్తా పేర్కొన్నారు.
క్రికెట్లో పరస్పర పరస్పర ప్రయోజనాల నిబంధనతో పరిపాలన మరింత మెరుగ్గా సాధ్యమవుతుందని బీసీసీఐ రాజ్యాంగ పునర్నిర్మాణ సమయంలో లోధా కమిటీ స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధన వల్లే బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సహా పలువురు మాజీ క్రికెటర్లు అనేక పదవులను వదులుకోవాల్సి వచ్చింది.
సుప్రీం కోర్టు ఆమోదించిన బీసీసీఐ రూల్ నంబర్ 38(4) నిబంధనలో భాగంగా కోహ్లీ ఒకేసారి రెండు పదవులను చేపట్టారు. కాబట్టి అతడు ఏదో ఓ పోస్టును వదులుకోవాలి. ఈ విషయమై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఎథిక్స్ ఆఫీసర్ను కోరుతున్నా. లోధా కమిటీ నిబంధనలను అమలుపరచాలనేదే ఈ ఫిర్యాదు ముఖ్య ఉద్దేశం. ఓ వ్యక్తి ఎదుగుదలకు నేను ఎప్పుడూ బాధపడను. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించకూడదు. సుప్రీం కోర్టును ప్రతి ఒక్కరూ గౌరవించాలి. 100 శాతం నిబంధనలను పాటించాలి అని సంజీవ్ గుప్త అన్నారు.
స్పోర్ట్స్ ఎల్ఎల్పీ అనే కంపెనీతో భారత కెప్టెన్కు సంబంధాలున్నాయని గుప్తా మెయిల్లో పేర్కొన్నారు. కార్నర్స్టోన్ వెంచర్ పార్ట్నర్స్ ఎల్ఎల్పీతో విరాట్కు భాగస్వామ్యం ఉందని ఇదివరకే వెల్లడించింది.