పరస్పర ప్రయోజనాల అంశంలో కెప్టెన్​ కోహ్లీపై మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా.. బీసీసీఐ ఎథిక్స్​ ఆఫీసర్​ డీకే జైన్​కు మెయిల్ పంపారు. ఇందులో విరాట్ వ్యాపార సంస్థల గురించి ప్రస్తావించారు. లోధా ప్యానెల్ సిఫారసులను అతడు​ ఉల్లంఘిస్తున్నాడని గుప్తా పేర్కొన్నారు.

 


క్రికెట్​లో పరస్పర పరస్పర ప్రయోజనాల నిబంధనతో పరిపాలన మరింత మెరుగ్గా సాధ్యమవుతుందని బీసీసీఐ రాజ్యాంగ పునర్నిర్మాణ సమయంలో లోధా కమిటీ స్పష్టంగా పేర్కొంది. ఈ నిబంధన వల్లే బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ సహా పలువురు మాజీ క్రికెటర్లు అనేక పదవులను వదులుకోవాల్సి వచ్చింది.

 

 

సుప్రీం కోర్టు ఆమోదించిన బీసీసీఐ రూల్​ నంబర్​ 38(4) నిబంధనలో భాగంగా కోహ్లీ ఒకేసారి రెండు పదవులను చేపట్టారు. కాబట్టి అతడు ఏదో ఓ పోస్టును వదులుకోవాలి. ఈ విషయమై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఎథిక్స్ ఆఫీసర్​ను కోరుతున్నా. లోధా కమిటీ నిబంధనలను అమలుపరచాలనేదే ఈ ఫిర్యాదు ముఖ్య ఉద్దేశం. ఓ వ్యక్తి ఎదుగుదలకు నేను ఎప్పుడూ బాధపడను. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించకూడదు. సుప్రీం కోర్టును ప్రతి ఒక్కరూ గౌరవించాలి. 100 శాతం నిబంధనలను పాటించాలి అని సంజీవ్ గుప్త అన్నారు.

స్పోర్ట్స్​ ఎల్​ఎల్​పీ అనే కంపెనీతో భారత కెప్టెన్​కు సంబంధాలున్నాయని గుప్తా మెయిల్​లో పేర్కొన్నారు. కార్నర్​స్టోన్​ వెంచర్​ పార్ట్​నర్స్ ఎల్​​ఎల్​పీతో విరాట్​కు భాగస్వామ్యం ఉందని ఇదివరకే వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: