పాదచారుడైన ఓ వృద్ధుడిని కారుతో ఢీకొట్టిన కారణంగా శ్రీలంక బ్యాట్స్​మన్​ కుశాల్​ మెండిస్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొలంబోలోని పనాదురా శివార్లలో ఓ 74 ఏళ్ల వ్యక్తిని కారుతో ఢీకొట్టిగా.. ఆ వృద్ధుడు మరణించాడు. మెండిస్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెజిస్ట్రేట్​ ఎదుట హాజరు పరిచారు.

 

శ్రీలంక జాతీయ జట్టుకు వికెట్​ కీపర్​గా వ్యవహరిస్తున్న మెండిస్​ ఇప్పటివరకు 44 టెస్టులు, 76 వన్డేలు ఆడాడు. కరోనా లాక్​డౌన్​ తర్వాత జరగుతున్న క్రికెటర్ల శిక్షణా శిబిరంలో మెండిస్​ పాల్గొన్నాడు. భారత్​, శ్రీలంక మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్​ను​ కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఇరు దేశాల బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: