లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడేజ్​ బెంజ్​ భారీ ఎత్తున కార్లను రీకాల్ చేయనుంది. ఆయిల్ లీకేజీ లోపం తలెత్తొచ్చనే అంచనాలతో.. ఈ ఏడాది చివరి నుంచి 668,954 కార్లను రీకాల్ చేయాలని నిర్ణయించింది. అయితే చైనాలో మాత్రమే కార్లను రీకాల్​ చేయాలని భావించడం గమనార్హం.

 

2013 డిసెంబర్​ నుంచి 2017 జూన్ మధ్య తయారైన సీ-క్లాస్​, ఈ-క్లాస్​, వీ-క్లాస్​, జీఎల్​కే-క్లాస్, సీఎల్​ఎస్​-క్లాస్ సహా పలు ఇతర మోడళ్లు రీకాల్ జాబితాలో ఉన్నాయి. చైనాలోని ఓ  మీడియా కథనం ప్రకారం డిసెంబర్​ 18న రీకాల్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్లన్నింటికీ డీలర్లు ఉచితంగానే రీప్లేస్​మెంట్ చేయనున్నారు.రీకాల్​ పరిధిలో ఉన్న వాహనాలు దాదాపు అన్ని చైనాలో తయారైనవే. 36 వేల యూనిట్లను మాత్రం దిగుమతి చేసుకున్నట్లు
 తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: