కశ్మీర్ భారత్ దేశంలో అంతర్భాగమని.. ఏక్ దేశ్మే దో నిశాన్, దోప్రధాన్, దోవిధాన్ ఎందుకు అన్న నినాదంతో పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు.
డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా నమస్కరిస్తు దేశ భక్తుడైన ఆయన భారతదేశ అభివృద్ధికి ఆదర్శప్రాయమైన కృషి చేశారు భారతదేశం ఐక్యతను మరింత పెంచడానికి అతను సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు. అతని ఆలోచనలు మరియు ఆదర్శాలు దేశవ్యాప్తంగా లక్షలాది మందికి బలాన్ని ఇస్తాయి.అని ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
I bow to Dr. Syama prasad Mookerjee on his Jayanti. A devout patriot, he made exemplary contributions towards India’s development. He made courageous efforts to further India’s unity. His thoughts and ideals give strength to millions across the nation.
— narendra modi (@narendramodi) July 6, 2020