ప్రకాశం సహా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పుడు పోలీసులు కరోనా మాట వింటే చాలు భయపడుతున్నారు.  ఎస్సై లు సిఐలు సహా పలువురు అధికారులు ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు.  నిన్న ఒక్క రోజే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 18 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇక ప్రకాశం జిల్లాలో దాదాపు 20  మంది వరకు కరోనా బారిన పడ్డారు. 

 

మరి కొంత మందికి కరోనా సోకే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇపుడు పోలీసులు విధులకు వచ్చే సమయంలో వారికి అనేక వైద్య పరిక్షలు చేస్తున్నారు. ఉన్నతాధికారులు అయితే విధులకు హాజరు కావాలి అంటే భయపడుతున్నారు. ట్రాఫిక్ సిబ్బందిలో కూడా  కరోనా కేసులు క్రమంగా ఆందోళన  కలిగిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: