ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి విషయంలో ఎన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా తీసుకున్నా సరే  విపక్ష తెలుగుదేశం మాత్రం  పదే పదే ఏదోక రూప౦లో ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా మరోసారి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేసారు. క్వారంటైన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసారు. 

 

రాష్ట్రంలో ఎన్ని క్వారంటైన్ సెంటర్లు నడుస్తున్నాయి. పౌష్టికాహారం పేరుతో కాంట్రాక్టర్లకు ఎంత చెల్లిస్తున్నారు? మెనూ వివరాలు ఏంటి? గత వంద రోజుల్లో క్వారంటైన్ లో ఎంత మంది ఉన్నారు? మంచి నీళ్లు, మందులైనా ఇస్తున్నారా? నాణ్యత లేని ఆహారం తినలేమంటున్న బాధితుల ఆక్రందనలు మీకు వినిపించడం లేదా సిఎం వైఎస్ జగన్ గారూ ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: