దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. ప్రతీ రోజు వందల మరణాలు వేల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కేసులు 7 లక్షలకు చేరువలో ఉన్నాయి దేశ వ్యాప్తంగా. గత 24 గంటల్లో 24,248 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

అదే విధంగా గత 24 గంటల్లో 425 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దేశ వ్యాప్తంగా మొత్తం కేసులు 6,97,413 గా ఉన్నాయి. వీటిలో 2,53,287 క్రియాశీల కేసులు ఉన్నాయి అని కేంద్రం కాసేపటి క్రితం వెల్లడించింది. 4,24,433 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటున్నారు. 19,693 మంది దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: