వికాస్ దుబే అనే ఒక గ్యాంగ్ స్టర్ ఇటీవల కాన్పూర్ లో జరిపిన కాల్పులు సంచలనంగా మారాయి. అతను ఈ కాల్పుల్లో 8 మంది పోలీసులను స్పాట్ లోనే అత్యంత దారుణంగా చంపడం చూసి యావత్ దేశం కూడా ఒక్కసారిగా  భయపడిపోయింది. ఈ ఘటనలో మరణించిన 8 మంది పోలీసులకు తాజాగా  పోస్ట్ మార్టం చేసారు. 

 

ఈ పోస్ట్ మార్టం నివేదికలో డీఎస్పీ తలను అతను నరికాడు అని ముక్కలు ముక్కలు చేసాడు అని వెల్లడించారు. ఇక ఒక ఎస్సై శరీరం లో అయితే పూర్తిగా తూటాలు ఉన్నాయి అని తేల్చారు. మరో ఎస్సై  తల అయితే వెనక్కు తిరిగి ఉంది. ఈ దారుణ కాండ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భయపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: