ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా వేసారు. వాస్తవానికి ఎల్లుండు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. జులై 8 న వైఎస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలి అని భావించారు. 

 

30 లక్షల మందికి ఇళ్ళ పట్టాలను పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అనూహ్యంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ఏపీ సర్కార్ ప్రకటించింది. ఆగస్ట్ 15 న ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. అయితే ఎందుకు వాయిదా వేస్తున్నారు అనేది ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే దీనికి సంబంధించిన తేదీని ప్రకటించే అవకాశం ఉంది. రేపు సాయంత్రం సిఎం జగన్ ఇడుపలపాయ వెళ్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: