ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ ప్రజలను కాపాడుతోన్న పోలీసులను వెంటాడుతోందనే చెప్పాలి. ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 5 వేలకు పైగా పోలీసులు కరోనా నేపథ్యంలో బయట విధులు నిర్వహిస్తూ కరోనా భారీన పడ్డారు. వీరిలో కొందరు చనిపోయారు. ఇక ఏపీలోనూ కరోనా పోలీసులను వెంటాడుతోంది. తాజాగా విశాఖపట్నంలో పలువురు పోలీసులకు కరోనా సోకింది.
నగరంలోని ద్వారక పోలీస్స్టేషన్ లా అండ్ ఆర్డర్ సీఐ, ఎస్.ఐలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు ద్వారక పోలీస్స్టేషన్లో ఐదుగురు పోలీసులు కరోనాకు గురయ్యారు. ద్వారకా పోలీస్ స్టేషన్ క్రైమ్ సీఐ, హెడ్ కానిస్టేబుల్, హోమ్గార్డ్లకు ఇదివరకే కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా సీఐ, ఎస్.ఐలు కరోనా భారిన పడటంతో వారిని కలిసిన సిబ్బందిలో కరోనా భయం మొదలైంది.