ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షల విషయంలో... దేశం మొత్తం కీర్తిస్తున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. మొదటి నుండి, వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్రానికి తప్పుడు లెక్కలు చెప్తున్నారు అని ఆయన ఆరోపించారు. అనంతపూర్ జిల్లా నుండి వచ్చిన ఈ వీడియో దీనికి రుజువు అంటూ ఒక వీడియో పోస్ట్ చేసారు.

 

వారి నమూనాలను కూడా ఇవ్వని వ్యక్తులు వాటిని నెగటివ్ / పాజిటివ్ అని ప్రకటించే మెసేజ్ లను అందుకున్నారని ఆయన ఆరోపించారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చడానికి తమ మీద విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నేసిన 'వన్ మిలియన్ కోవిడ్ పరీక్షలు' కథనం ఒక మోసం / కుంభకోణమని అన్నారు. దీనిని వెంటనే పరిశీలించి, ప్రభుత్వం  నడుపుతున్న 'SMS టెస్టింగ్ రాకెట్' వెనుక ఉన్న నేరపూరిత ఉద్దేశ్యాన్ని బహిర్గతం చేయాలని నేను కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: