ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ శాఖల్లో ఇప్పుడు కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులు ప్రభుత్వ శాఖల్లో రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో 33 కరోనా కేసులు బయటపడ్డాయి. ఏపీ మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యాలయంలో 33 మందికి కరోనా వచ్చింది అని వెల్లడి అయింది. 

 

ఈ  నేపధ్యంలో సదరు కార్యాలయాన్ని మూసి వేసారు. గుంటూరు జిల్లాలో నిన్న ఒక్క రోజే 150 కేసులు నమోదు అయ్యాయి. అమరావతి రోడ్డులో  ఈ  కార్యాలయంలో మొత్తం 120 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 33 మందికి రావడమే కాకుండా ఏకంగా రాష్ట్ర డైరెక్టర్ కి కరోనా వచ్చింది. వారి కుటుంబాలను హోం క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: