ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారు. తాజాగా విజయవాడ ఎంపీ కేసినేని నానీ విమర్శలు చేసారు. ఏడాది పాలనలో అభివృద్ధి రివర్స్ చేసారు అని టీడీపీ విజయవాడ ఎంపీ కేసినేని నానీ ఆరోపణలు చేసారు. తాజాగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా సక్రమంగా వాడటం లేదు అని మండిపడ్డారు. 

 

వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో విజయవాడకు ఇచ్చిన నిధులను విడుదల చేయలేదు అని మండిపడ్డారు. కేంద్రం నిధులను ఖర్చు చేయలేదు అంటే మాత్రం వెనక్కు వెళ్ళిపోతాయి అని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ లకు కక్కుర్తి పడి అభివృద్ధి ని గాలికి వదిలేసారు అని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: