తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌, తెలంగాణ మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ సిరాజుద్దీన్ క‌న్నుమూశారు.. గ‌త కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న‌.. కొద్దిసేప‌టి క్రిత‌మే హైద‌రాబాద్‌లో మృతిచెందిన‌ట్టు కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.  తెలంగాణ మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ సిరాజుద్దీన్ ఎంతో సేవలు చేశారు.

 

ఇక తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఆయన పోరాటం చేశారు. ఇక‌, ఆయన మృతి పట్ల ఏఐసీసీ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా, టి.పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికార ప్రతినిధి నిరంజన్‌.. త‌దిత‌రులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. సిరాజుద్దీన్ కాంగ్రెస్‌లో ఒక క్రమశిక్షణ గల నాయకుడని, మంచి భవిష్యత్ ఉన్న నాయకుడిని కాంగ్రెస్ కోల్పోయింద‌ని పార్టీ నేత‌లు పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: