ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 1322 మందికి కరోనా సోకింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 20 వేలు దాటింది. ఏడుగురు కరోనా కారణంగా గత 24 గంటల్లో ప్రాణాలు కోల్పోయారు. 

 

ఏపీలో ఇప్పటి వరకు 239 మంది మరణించారు. ఏపీ వారికి 1263 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 56 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 20 వేల 19 కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 10 లక్షల 33 వేల పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. గత 24 గంటల్లో 15 వేల కరోనా పరిక్షలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: