కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పన్ను దాఖలు గడువు సహా పలు గడువులను పెంచుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆధార్ పాన్ లింక్ గడువుని కేంద్ర ప్రభుత్వం పెంచింది. పాన్-ఆధార్ లింకింగ్ 2021 మార్చి 31 వరకు చేయవచ్చు అని ఆదాయపు పన్ను శాఖ కాసేపటి క్రితం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

 

కరోనా వైరస్ కారణంగా తాము ఈ గడువు ని పెంచుతున్నామని ఆదాయపు పన్ను శాఖ కాసేపటి క్రితం ఒక ప్రకటన లో వెల్లడించింది. తాము ఈ సమయాన్ని అర్ధం చేసుకున్నామని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటనలో వివరించింది. కాగా ఇప్పటికే దేశంలో సగం మంది పాన్ ఆధార లింక్ చేసుకున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: