మహారాష్ట్రలో కోరనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్నాయి. తాజాగా మరోసారి అక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక అది పక్కన పెడితే పోలీసుల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.  నిన్న 30 మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. 

 

నేడు ఏకంగా 250 మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన 279 మంది పోలీసు సిబ్బంది గత 24 గంటల్లో కరోనా బారిన పడ్డారు అని పోలీసు శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 5,454 గా ఉందని... 1,078 యాక్టివ్ కేసులు ఉన్నాయి అని పేర్కొన్నారు. 70 మంది పోలీసులు మరణించారు అని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: