హైదరాబాద్ లో కరోనా కేసులు  రోజు రోజుకి  పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సమర్ధవంతంగా చర్యలు తీసుకున్నా సరే కరోనా తీవ్రత మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఇక తెలంగాణా కరోనా తీవ్రత కూడా వేగంగా పెరుగుతుండటంతో  ఇక రంగంలోకి గవర్నర్ తమిళిసై రంగంలోకి దిగారు. 

 

ప్రభుత్వ చర్యలు, వ్యాధి తీవ్రత, రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్ తమిళిసై దృష్టి పెట్టారు. ఆమె  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులను రాజ్ భవన్‌కు రావాలి అని ఆదేశాలు ఇచ్చారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆమె స్వయంగా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. గాంధీ ఆస్పత్రి విషయంలో తీసుకునే నిర్ణయాలను కూడా ఆమె సమీక్షించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: