కర్ణాటక లో కరోనా కేసులు వేగంగా పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర సర్కార్ తీసుకునే చర్యలు కూడా పెద్దగా ఫలించడం లేదు. వేల కేసులు రోజుల వ్యవధిలో అక్కడ నమోదు అవుతూనే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే మాండ్యా ఎంపీ సుమలత కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమెకు కరోనా లక్షణాలు కనపడగా పరిక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 

 

దీనితో ఒక్కసారిగా ఆమె అభిమానులు ఓటర్లు నియోజకవర్గ ప్రజలు షాక్ అయ్యారు. ఆమె 2019 ఎన్నికల్లో బిజెపి మద్దతుతో ఎంపీ అయిన సంగతి తెలిసిందే. కాగా కర్ణాటకలో కరోనా కేసులు ప్రతీ రోజు కూడా 1500 కి పైగా నమోదు అవుతున్నాయి. అక్కడ పెద్ద కోవిడ్ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: