తమిళనాడు లో కరోనా కేసులు ఏ మాత్రం ఆగడం లేదు. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గాని తగ్గడం లేదు. వేల కేసులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నా సరే కరోనా కేసుల తీవ్రత మాత్రం ఆగడం లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే తాజాగా అక్కడ మరోసారి దాదాపు గా 4 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడులో 61 మరణాలు మరియు 3,827 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,978 గా ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. వీటిలో 46,833  క్రియాశీల కేసులు మరియు 1,571 మరణాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: