భారత సైన్యంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా బోర్డర్ సెక్యురిటి ఫోర్స్ లో కరోనా కేసులు మాత్రం పెరుగుతున్నా సరే ఇతర బలగాల్లో మాత్రం క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటను ఇచ్చే అంశం గా చెప్పవచ్చు. ఇక ఇండో టిబిటేన్ బోర్డర్ పోలీస్ లో కరోనా కేసులు ముందు కాస్త భయపెట్టినా సరే ఇప్పుడు కాస్త  తగ్గాయి. 

 

ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి)  చెందిన మరో ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గత 24 గంటల్లో  కరోనా నుంచి భారీగా వారు కోలుకున్నారు కూడా. మొత్తం 151 క్రియాశీల కేసులు ఉన్నాయని... 273 మంది కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్నారు అని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: