గత కొన్ని రోజులుగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.  అయితే అధికార పక్షం వారు తమ పై పగబట్టి మరీ కేసులుపెడుతూ జైళ్లకు పంపుతున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. తాజాగా  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. నేరానికి కులాలు మతాలు ఉండవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. తమ నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న టీడీపీ ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు.  తప్పు ఎవరు చేసినా చట్టం తనపని తాను చేసుకుపోతుందని, బీసీ నేతను హత్యచేసిన కేసులో మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లురవీంద్రను అరెస్ట్‌ చేయడమే అందుకు నిదర్శనమన్నారు.

 

చట్టం అందరికి ఒకటేనని ఓసీ, బీసీలకు ప్రత్యేకంగా ఉండదని తెలిపారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు తప్పుచేశారు కాబట్టే అరెస్ట్ చేశారని,  అచ్చన్న, అయ్యన్న, కొల్లు స్థానంలో లోకేష్ చౌదరి ఉన్నా అరెస్ట్ చేసేవాళ్లమని స్పష్టం చేశారు. కాగా, అధికారంలో ఉండగా బీసీలకు చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు.   బీసీలను అన్నివిధాలా ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనని తెలిపారు. బీసీలను ఉపముఖ్యమంత్రులను చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ గారికే దక్కుతుందని పార్థసారథి పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: