పాకిస్థాన్​లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి జాఫర్ మిర్జాకు వైరస్ సోకింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా స్వయంగా ఆయనే ప్రకటించారు.

శుక్రవారం పాక్​ విదేశాంగ మంత్రి షా మహ్మద్​ ఖురేషీకి కూడా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే దాయాది దేశానికి చెందిన పలువురు చట్టసభ్యులు వైరస్​ బారిన పడ్డారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.పాకిస్థాన్​లో ఇప్పటివరకు 2,31,818 మందికి వైరస్​ సోకగా.. 4,762 మంది బలయ్యారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: