భారత్ ఆర్థిక సాయంతో నేపాల్లోని ఇలం జిల్లాలో నిర్మించిన ఓ పాఠశాల భవనాన్ని సోమవారం ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది.వేద, ఆధునిక విద్యలు బోధించే ఈ పాఠశాల... భవన నిర్మాణం కోసం భారత్ రూ.1.94 కోట్లు (నేపాలీ రూపాయల్లో 31.13 మిలియన్లు) ఆర్థిక సాయం అందించింది.
నాలుగు అంతస్తుల ఈ పాఠశాల భవనంలో 10 తరగతి గదులు, విద్యార్థుల కోసం తొమ్మిది వసతి గృహాలతో హాస్టల్ బ్లాక్, నాలుగు స్టడీ రూంలు, ఓ లివింగ్ రూం, వార్డెన్ కార్యాలయం, ఓ సమావేశ మందిరం ఉన్నాయి.2015లో సంభవించిన భారీ భూకంపం ధాటికి నేపాల్లోని అనేక భవనాలు కుప్పకూలాయి. అనేక పాఠశాలలు కూడా దెబ్బతిన్నాయి. దీనితో నేపాల్ విద్యార్థుల భవిత కోసం భారత్ అనేక పాఠశాలల నిర్మాణానికి ఆర్థిక చేయూతనందించింది.