విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో మరో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు పండు, సందీప్ గ్యాంగ్​లకు సంబంధించి ఈ కేసులో 33 మంది నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గ్యాంగ్ తో సంబంధం ఉన్న వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు చెబుతున్నారు.

 

తాజాగా అరెస్ట్ చేసిన నిందితుల నుంచి 5 సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: