జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులకు భారత బలగాలు చుక్కలు చూపిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చినా సరే ఇప్పుడు మాత్రం అదే స్థాయిలో దూకుడు గా వెళ్తున్నాయి భారత బలగాలు. ఉగ్రవాదులు ఉన్నారు అనే నిఘా వర్గాల సమాచారం అందుకున్న వెంటనే దూకుడుగా దాడులు చేస్తున్నాయి. తాజాగా పుల్వామా లో మరో ఎన్కౌంటర్ జరిగింది. 

 

పుల్వామాలోని గూసు ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. పోలీసులు, భద్రతా దళాలు ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని ఆర్మీ అధికారులు వివరించారు.  ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని భారత బలగాలు కాల్చి చంపాయి అని కాశ్మీర్ జోన్ పోలీస్ లు వెల్లడించారు. ఉగ్రవాదులపై సంయుక్తంగా భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్ పోలీసులు దాడులకు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: