నేడు రెండు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. సింగపూర్ సహా ఇండోనేషియాలో రెండు దేశాల్లో కూడా ఆరు తీవ్రత తో భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతతో భూకంపం ఇండోనేషియాలోని సెమరాంగ్కు 142 కిలోమీటర్ల ఉత్తరాన సంభవించిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
యూరోపియన్ – మధ్యధరా సముద్రం భూకంప కేంద్రంగా ఉంది అని అధికారులు పేర్కొన్నారు. అయితే సునామీ హెచ్చరికలు ఏమీ అధికారులు జారీ చేయలేదు. అదే విధంగా రిక్టర్ స్కేల్పై 6.1 తీవ్రతతో సింగపూర్కు ఆగ్నేయంగా 1102 కి.మీ. వద్ద భూకంపం వచ్చింది అని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏ విధమైన ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.