దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా బాధితుల ఆత్మహత్య  ఘటనలు సంచలనంగా మారాయి. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం,  లేదా ఆత్మహత్యా ప్రయత్నాలు చేయడం లేదా క్వారంటైన్ నుంచి పారిపోవడం వంటివి జరుగుతున్నాయి. అసలు దానికి కారణం ఏంటీ అనేది తెలియడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. 

 

కొంధ్వాలోని పూణే మునిసిపల్ కార్పొరేషన్ క్వారంటైన్ కేంద్రంలో నిన్న 60 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని పూణే పోలీసులు వెల్లడించారు. అతను మరియు అతని కుమారుడు కరోనా వైరస్ బారిన పడ్డారు అని  ఎందుకు మరణించారు అనేది తెలియడం లేదు అని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన  పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: