దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోజు వేల కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 22 వేల 25 2 నమోదు అయ్యాయి అని కేంద్రం కాసేపటి క్రితం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. 

 

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7 లక్షల 19 వేల 665 కి చేరుకుంది అని కేంద్రం ప్రకటించింది. యాక్టివ్ కేసులు దేశ వ్యాప్తంగా చూస్తే 2 లక్షల 59 వేలు ఉన్నాయి. 4 లక్షల 39 వేల మంది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని బయటపడగా నిన్న ఒక్క రోజే 467 మంది కరోనా కారణంగా మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: