టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో మాజీ ఆటగాళ్ళు ప్రస్తుత ఆటగాళ్ళు అతనికి విష్ చేస్తున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేస్తూ ధోనీ గొప్పతనం చెప్పాడు. ఒక తరంలో ఒకే క్రీడాకారుడు వస్తాడు అని అతనితో దేశం మొత్తం కనెక్ట్ అవుతుంది అని... అతనిని కుటుంబ సభ్యుడిగా భావిస్తుంది అని సెహ్వాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 

 

“కుచ్ బహుత్ అప్నా సా లగ్తా హై. ఎంతో మందికి ధోని ఆదర్శం” అంటూ సెహ్వాగ్ తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక అతనితో కలిసి దిగిన ఒక ఫోటోని తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. రాజకీయ ప్రముఖులు కూడా ధోనికి విష్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: