భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు  భారత వైమానిక దళం అప్రమత్తంగా ఉంటుంది. సరిహద్దుల్లో భారత అర్మీని ఎప్పుడు అయితే చైనా లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం మొదలు పెట్టిందో అక్కడి నుంచి కూడా యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే భారత ఆర్మీ సిద్దంగానే ఉంది.  ఇక తాజాగా... భారీగా యుద్ద విమానాలు సరిహద్దుల్లో చైనాను టార్గెట్ చేసాయి. 

 

భారత వైమానిక దళంకు చెందిన అపాచీ హెలికాప్టర్, మిగ్ -29 యుద్ధ విమానం, చినూక్ హెవీలిఫ్ట్ హెలికాప్టర్  భారతదేశం - చైనా సరిహద్దు సమీపంలో ఉన్న ఫార్వర్డ్ ఎయిర్ బేస్ వద్ద రాత్రి కార్యకలాపాలు నిర్వహిస్తోన్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కాగా సరిహద్దుల నుంచి చైనా వెనక్కు తగ్గిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: