గోవా లో కరోనా తగ్గినట్టే  మళ్ళీ వేగంగా విస్తరిస్తుంది. కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి ద్వారా కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సురేష్ అమోన్‌కర్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆయన వయసు 68 ఏళ్ళు కాగా ఆయన మూడేళ్ళ పాటు అంటే  1999 నుంచి 2002 వరకు ఆ రాష్ట్ర ఆరోగ్య సాంఘీక కార్మిక శాఖా మంత్రిగా సేవలు అందించారు. 

 

ఆయనకు వారం క్రితం కరోనా రాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స చేసినా సరే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు సమర్ధవంతమైన మంత్రిగా మంచి పేరు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: