హైదరాబాద్ లోని పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ అయింది. దీనితో ఆయన ఎస్కార్ట్ లోని బొలెరో వాహనం పల్టీలు కొడుతూ బోల్తా పడింది. వేగంగా వెళ్ళిన నేపధ్యంలో కారుని డ్రైవర్ అదుపు చేయలేకపోయారు. 

 

ఈ ఘటనలో హెడ్‌ ‌కానిస్టేబుల్ పాపయ్య  ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి అని అధికారులు వెల్లడించారు. వెంటనే స్పందించిన మంత్రి తన వాహనంలోనే బాధితులను హయత్ నగర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. గచ్చిబౌలీ నుంచి విజయవాడ వచ్చే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: