ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పరీక్షలను పెంచాలి అని సిఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాసేపటి క్రితం ఆయన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు అదే విధంగా మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా తీవ్రతకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

 

కరోనా వైరస్ కట్టడి కావాలి అంటే పరిక్షలు చెయ్యాల్సిందే అని సిఎం జగన్ మరోసారి స్పష్టం చేసారు.  ప్రతీ రోజు కూడా 50 వేల కరోనా పరిక్షలు చెయ్యాలి అని ఆయన స్పష్టం చేసారు. ఎక్కడా కూడా కరోనా పరిక్షల విషయంలో అలసత్వం వద్దు అని సిఎం ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేసారు. ఈ కార్యక్రమంలో ఇళ్ళ పట్టాల గురించి కూడా చర్చ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: