ఏపీలో ఎంతో  మంది ప్రజాప్రతినిధులు కరోనా  వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా కరోనా  వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత రెండు రోజుల నుంచి కడప జిల్లా పర్యటన నేపథ్యంలో.. పలువురు ప్రజా ప్రతినిధులకు అధికారులకు కరోనా పరీక్షలు నిర్వహించగా  ఏపీ ఉపముఖ్యమంత్రికి  పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 

 

 దీంతో అంజాద్ బాషా ను   హోమ్ క్వారంటైన్  వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక ఆయనకు మరోసారి అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు . దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది

మరింత సమాచారం తెలుసుకోండి: