క‌రోనా ఏపీలో ఏకంగా ఒక శాఖ‌ను ప‌గ‌బట్టేసింది. ఆ శాఖ‌లోని ఓకే ఆఫీస్‌లో ఏకంగా 33 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. గుంటూరు జిల్లా అమరావతి రోడ్డులో ఉన్న మహిళా శిశు సంక్షేమ రాష్ట్ర కార్యాలయంలో ఒకే రోజు 33 మంది ఉద్యోగులకు పాజిటీవ్ వచ్చింది. ఈ శాఖ‌లో ప‌నిచేస్తోన్న రాష్ట్ర స్థాయి డైరెక్ట‌ర్‌కు ముందుగా పాజిటివ్ ఉంద‌న్న విష‌యం నిర్దార‌ణ అయ్యింది. ఆ త‌ర్వాత ఆ ఆఫీస్‌లో ప‌లువురు జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నారు.

 

అనుమానం వ‌చ్చి ఆఫీస్‌లో ఉన్న 120 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా.. మొత్తం 33 మందికి క‌రోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. మిగతా వారిని హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. అయితే ఒకేసారి ఓ శాఖ కార్యాలయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కరోనా బారిన పడటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో మిగతా శాఖల ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: