కరోనా వైరస్ బారిన పడ్డ జర్నలిస్టుల వెన్నుతట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. విధి నిర్వహణలో కరోనా వైరస్ బారిన పడ్డ జర్నలిస్టులను ఆదుకునేందుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఆర్థిక సాయం అందజేసేందుకు. ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన జర్నలిస్టులు ధ్రువీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఒక ప్రత్యేకమైన యాప్ ను విడుదల చేసింది. జర్నలిస్టులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అలాగే కరోనా వైరస్ బారినపడి మృతి చెందిన జర్నలిస్టులకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.