వైసీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కలిసేందుకు టీడీపీ నేతలు జైలు వద్దకు వెళ్లగా అధికారులు అనుమతించలేదు. 

 

 ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు ఉన్నందున ములాఖత్ నిర్వహించడం లేదు అని  అనుమతి నిరాకరించారు  జైలు  అధికారులు . ఈ నేపథ్యంలో జైలు బయట ప్లకార్డులతో  మాజీ మంత్రి దేవినేని ఉమ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు.. మాజీ ఎమ్మెల్సి  ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి వాసు తదితరులు నిరసన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: